TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న నగదును ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నిజాయతీగా తిరిగి అప్పగించారు. అమ్మవారు ఆలయ మహాద్వారం సెక్యూరిటీ స్కాన్ వద్ద చెన్నైకి చెందిన తులసి దాస్ భక్తుడు నగదు బ్యాగును పోగొట్టుకున్నారు. దానిని కానిస్టేబుల్ రమేశ్ గుర్తించి, బ్యాగులోని గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ భక్తుడికి అందజేశారు.