KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. టీడీపీ రాజంపేట ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1న కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.