ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల వినతులను తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపించి, పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.