AKP: ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగిన లింగంపేట శ్రీ నూకాలమ్మ తల్లి జాతర హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీ ఆదాయం రూ.1,55,639, తలనీలాల రూపంలో రూ.66వేలు, టికెట్ల రూపంలో 93070 రూపాయలు వచ్చినట్లు దేవాదాయ ధర్మ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.