కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో జనాభా గణన–2027 (దశ-1)కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్ రాకేష్ చంద్ర ప్రారంభించారు. గణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఫీల్డ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించి, ఎలాంటి లోపాలు లేకుండా డేటా సేకరణ జరగాలని ఆదేశించారు.