AP: దివంగత నేత ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘నాకు అత్యంత ఆప్తుడు కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. MLA, MP, కేంద్రమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. చివరి క్షణం వరకు ప్రజా సేవ లోనే గడిపిన ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం’ అని పేర్కొన్నారు.