యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో బాస్మతీ బియ్యం ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. సుమారు 10 లక్షల టన్నుల బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు షిప్పింగ్ కంపెనీలు ‘వార్-రిస్క్ సర్ ఛార్జ్’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది ఎగుమతిదారులపై పెను భారంగా మారింది.