PLD: సత్తెనపల్లి నియోజకవర్గం ఫనిదేం గ్రామంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.