మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఒక మహిళా సహాయకురాలు బాత్రూంకు వెళ్లిన క్రమంలో పైనుంచి సిమెంటు దిమ్మెలు కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు త్వరగా కొత్త భవనం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.