SRCL: వీర్నపల్లి మండలం జవహర్లాల్ నాయక్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల నీటి కష్టాలను గమనించిన సర్పంచ్ భూక్యా లతా జనార్ధన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. సొంత ఖర్చుతో నూతన బోరు మోటార్ను ఏర్పాటు చేసి విద్యార్థుల దాహార్తిని తీర్చారు. పాఠశాలలో కనీస సౌకర్యాల కల్పనే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భెంగా తెలిపారు.