BDK: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక రేపు వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రామాలయ అభివృద్ధికి 351 కోట్ల నిధులు మంజూరు కాగా 3 దశల్లో 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ధన్యవాదాలు తెలిపారు.