KRNL: గురువారం మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో, బస్సులో మంటలు చెలరేగి పది మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు.