KDP: స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు కావడం హర్షదాయకమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు,పెట్టుబడుల ఆకర్షణకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని ఆయన అన్నారు.