W.G. భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బుధవారం ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బకాయిలు ఉన్నవారికి కుళాయి కనెక్షన్ నిలుపుదల, ట్రేడ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. 50% పన్ను రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.