గుంటూరులో జరిగిన ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు హాజరైన విషయం తెలిసందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎం రాకతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.