ATP: గుంతకల్లు పట్టణంలోని కాకతీయ పాఠశాల ఎదుట బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు.