BHNG: ఆలేరు మున్సిపల్ లోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. అనంతరం వార్డులో పారిశుద్ధ్య పరిస్థితిని అధికారులు, సిబ్బందితో కలిసి చూశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.