కామారెడ్డి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో క్యూ కట్టవద్దని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేసి గందరగోళం సృష్టించవద్దని వాహనదారులకు సూచించారు.