ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకు పురుషులదే హవా. ప్రస్తుతం ఒక్క మహిళ కూడా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.