GNTR: పొన్నూరులో ముస్లింల సంక్షేమం కోసం ఏర్పడిన అంజుమన్ కమిటీ, హామీలు నెరవేర్చలేకపోయిందని 28వ వార్డు డైరెక్టర్ సయ్యద్ జానీ భాష విమర్శించారు. ఏడాది కాలంగా పేదలు, వితంతువులకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ పని తీరు నచ్చక తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కమిటీకి సూచించారు.