SKLM: ఆయా శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డా.బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తదితర శాఖల అధికారులతో ఆయన ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో సమీక్షించారు.