అన్నమయ్య: రామాపురంలోని సాయి నగర్లోని సమర్థ సద్గురు దర్గా స్వామిజీ, సమర్థ సద్గురు మాతాజీ ఆశ్రమంలో రేపటి నుంచి శ్రీరామ నవమి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమ మందిరంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.