NLR: బుచ్చి మండలం జొన్నవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముందుగా జొన్నవాడ గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను, వాటర్ బోర్ పాయింట్లను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.