ATP: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరించడంపై YCP అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాది కాలంగా నిలిచిపోయిన అనుమతులపై అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.