MLG: మేడారం సమ్మక్క-సారలమ్మల హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మహాజాతర అనంతరం భక్తులు భారీగా తరలివచ్చి సమర్పించిన కానుకలతో గద్దెలపై ఉన్న సుమారు 30 హుండీలు నిండాయి. జాతర ఈఓ వీరాస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.