MNCL: తాండూర్ మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వే ట్రాక్పై ఫర్హానా (29) అనే వివాహిత మంగళవారం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు బెల్లంపల్లి సుభాష్ నగర్కు చెందిన వ్యక్తి అని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.