BPT: జిల్లాలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల అవగాహన కార్యక్రమాలను మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ.. ప్రజలు టీబీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత చికిత్సను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.