VZM: చీపురుపల్లి మండలంలో ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ డి.ధర్మరాజు సూచించారు. భూ సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గొల్లలపాలెం, నిమ్మలవలస, మెట్టపల్లి, పతికేయవలస, ఆంజనేయ పురం,పెదనాడపల్లి, ఇటకర్లపల్లి గ్రామాలలో సర్వే జరుగుతుందని తెలిపారు.