ADB: ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మైనార్టీల నాయకుడు సిరాజ్ ఖాద్రి మరణం సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలురి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం MIM పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.