ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని ఒంగోలు బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంశ్య విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని ఆరా తీసి, నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహం పరిసరాల్లో శుభ్రత, సౌకర్యాల ఏర్పాటు పై కూడా పలు సూచనలు చేశారు.