NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పశువుల సంత వేలం ముగిసింది. వేలంలో జగ్జీవన్ రావ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.39,01,000 పాడి టెండర్ దక్కించుకున్నారు. ప్రతి శనివారం జరిగే ఈ సంతలో మున్సిపల్ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు.