PPM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.