VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం పట్టణంలోని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా మురుగునీటి కాలువలలో ఉన్న పైపులను తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనుల్లొ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.