NDL: బేతంచర్ల నగర పంచాయతీ కార్యాలయంలో రేపు సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ CH. చలం రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అయితే, గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కరించారనే అంశంపై చర్చించనున్నారు.