అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మికపరమైన సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఈవో శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.