NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు సోమవారం చేపట్టారు. మొత్తం దాదాపుగా 45 రోజులకు గాను రూ. 52,20,244 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. హుండీల ద్వారా వచ్చిన మొత్తమును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పెంచలకోన బ్రాంచ్లో జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు.