E.G: నూతనంగా రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఆర్.శివ రాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జేసీ వై.మేఘా స్వరూప్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీకు పూల మొక్కను అందజేశారు. జేసీ ఆర్.శివ రాముడిని అభినందించి ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు.