SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 49 మంది తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.