TG: బీజేపీ తలపెట్టిన ఛలో అసెంబ్లీని అడ్డుకోవడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని.. రాంచందర్ రావు సహా బీజేపీ సీనియర్లను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అభద్రతాభావానికి అద్దంపడుతోందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా..? లేక పోలీస్ బలగాలతో పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.