CTR: కాణిపాకం టోల్గేట్ టెండర్ల ప్రక్రియ నేడు నిర్వహించనున్నారు. మొత్తం 34 మంది టెండర్ దారులు దరఖాస్తు చేసుకోవడంతో ఈసారి బహిరంగ వేలానికి గట్టి పోటీ నెలకొంది. టోల్గేట్ను దక్కించుకునేందుకు కొంతమంది బడా నేతలు సిండికేట్గా ఏర్పడి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో టెండర్ల ప్రక్రియ ఉత్కంఠభరితంగా మారింది.