MHBD: కేసముద్రం మండలం అర్పణపల్లిలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు సోమవారం మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసిగా గుర్తించారు. సాయి ఉపాధి నిమిత్తం గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.