SRPT: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ‘అసెంబ్లీ ముట్టడి’కి వెళ్లకుండా నడిగూడెం పోలీసులు ఇవాళ ఉదయం బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.