NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలోని నాపరాతి గనుల్లో నిర్వహిస్తున్నపేకాట స్థావరంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9,500 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.