W.G: తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఉగాది నాటకోత్సవాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్.డీ. విల్సన్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను ఆదరించాలని, తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వెలసిల్లుతాయన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.