మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో దీపక్ అనే యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. నిందితులు భీమిని సంజీవ్, సీడం దీపక్ వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.