ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూనే, ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.