NLG: నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని రాజవరం మేజర్ చివరి భూములకు (టేల్ ఎండ్) సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. రాజవరం, తిరుమలగిరి సహా ఐదు గ్రామాల్లోని 500 ఎకరాల వరి పొలాలు నెర్రెలు వారుతున్నాయి. కాలువల్లో కంపచెట్లు పెరిగి, తూములు సరిగా లేక నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సాగునీరు అందించాలన్నారు.