KDP: మైదుకూరు పట్టణంలోని 8వ వార్డులో డ్రైనేజీ ఉన్నా ఉపయోగం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. మురుగునీరు కాలువల ద్వారా ముందుకు పోవడం లేదన్నారు. దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగాయని తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. మురుగు రోడ్డు పైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.