KMM: సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆదివారం పరామర్శించారు.పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన మృతుడు పానెం సులోమాన్ నివాసానికి వెళ్లిన ఆయన సులోమాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.