BHNG: మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి అదే గ్రామానికి కొంపల్లి అంజయ్యకు చెందిన మూడు ఎకరాల యాసంగి వరి పంట నేల కొరిగింది. చేతికి వచ్చిన యాసంగి పంట ఆకాల వర్షంతో లక్షలు పెట్టుబడి పెట్టి పంట కోసే సమయానికి పొలం నెలకొరడంతో రైతు అంజయ్య కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.